రాజోలు ఎమ్మెల్యేకు హైకోర్టు నోటీసులు

22 Oct, 2019 12:56 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి : రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌రావుకు, రిటర్నింగ్‌ అధికారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారని, బ్యాలెట్‌ ఓట్లలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు హోకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రిటర్నింగ్‌ అధికారిని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు