జననేత పాదయాత్ర పుస్తకావిష్కరణ

19 Jan, 2020 10:20 IST|Sakshi
పాదయాత్ర పుస్తకాన్ని విడుదల చేస్తున్న ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జననేత పాదయాత్రపై గొల్లల మామిడాడకు చెందిన సీనియర్‌ జర్నలిస్టు సబ్బెళ్ల శివన్నారాయణరెడ్డి రాసిన పాదయాత్ర పుస్తకాన్ని శనివారం ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గుంటూరు క్యాంపు కార్యాలయం విడుదల చేశారు. కాఫీ టేబుల్‌ బుక్‌ తరహాలో ఈ పుస్తకాన్ని ముద్రించారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రస్తావనతో మొదలైన ఈ పుస్తకంలో ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర, రాజ్యాధికారం చేపట్టడం, నవరత్నాలు అమలు తదితర అంశాలపై సాగింది. ప్రత్యేక కథనాలతో కూడిన ఛాయాచిత్రాలు ఆకట్టుకున్నాయి. 150 పేజీల ఈ పుస్తకాన్ని వినాయక పబ్లికేషన్స్‌ ప్రచురించింది. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు భీమవాదం భరత్‌రెడ్డి, సిద్ధారెడ్డి, ప్రముఖ మానసిక వైద్యుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు