ఆంధ్ర విషనాగులకు విరుగుడు ఉంది

4 Jan, 2014 02:36 IST|Sakshi

తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం
 
 హన్మకొండ, న్యూస్‌లైన్: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించకుండా ఆంధ్ర విషనాగులు అడ్డుకుంటున్నాయని, ఆ విషానికి తమ వద్ద విరుగుడు ఉందని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) 19వ రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా శుక్రవారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో కోదండరాం మాట్లాడారు. తెలంగాణ బిల్లును అసెంబ్లీలో చర్చిం చకుండా ఆంధ్ర విషనాగులను పాములోడు వచ్చి పట్టుకుపోతాడన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరగనీయకుండా చేసినా ఎలాంటి నష్టం ఉండబోదని చెప్పారు. అనంతరం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వరరావు మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు