పోలీసుల రక్షణ కోరిన ప్రేమజంట

18 Feb, 2019 11:38 IST|Sakshi
పోలీసుస్టేషన్‌లో నూతన వధూవరులు

చిత్తూరు, యాదమరి : ప్రేమించి పెళ్లి చేసుకున్నాం.. రక్షణ కల్పించాలంటూ మండలంలోని పెరుమాళ్లపెంటకు చెందిన సురేష్‌కుమార్‌ ఆదివారం పోలీసులను కోరారు. పెరుమాళ్లపెంటకు చెందిన అయ్యస్వామి కుమారుడు సురేష్‌ బెంగళూరులోని కత్తిరకుప్పంలో కుళాయి పని చేసుకుంటూ అక్కడే ఉన్న పద్మావతిని ప్రేమించాడు.

అమ్మాయి కుటుంబ సభ్యులు ససేమిరా  అనడంతో.. అక్కడి నుంచి పెరుమాళ్లపెంట గ్రామానికి వచ్చేశారు. అబ్బాయి తల్లిదండ్రులు వారి పెళ్లి చేశారు. అయితే అమ్మాయి తరఫున వారితో సమస్యలు రావచ్చని ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్‌ఐ సుబ్రమణ్యంనాయుడు ఇరువురి తల్లిదండ్రులతో మాట్లాడి సర్దుబాటు చేసి పంపారు.

మరిన్ని వార్తలు