మార్చి 28నే బడ్జెట్‌ సమావేశాల ముగింపు

23 Feb, 2018 02:24 IST|Sakshi

సాక్షి, అమరావతి: మార్చి 28తో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 29న గవర్నర్‌ విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో 28నే అప్రాప్రియేషన్‌ బిల్లును ఆమోదించాలని నిర్ణయించింది. అదే రోజు అప్రాప్రియేషన్‌ బిల్లును గవర్నర్‌ ఆమోదానికి పంపిస్తారు. దీంతో ఏప్రిల్‌ 1 నుంచి కొత్త బడ్జెట్‌ నుంచి నిధుల వ్యయానికి మార్గం సుగమం అవుతుంది.

మార్చి 5న ఉదయం 9.30 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. అనంతరం సభ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. ఈ మేరకు సమాచార శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 6, 7 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై చర్చ , ఆ చర్చకు సీఎం సమాధానమిస్తారు. మార్చి 8న ఆర్థిక మంత్రి యనమల  బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

మరిన్ని వార్తలు