మిథున్ రెడ్డికి బెయిల్

28 Jan, 2016 02:16 IST|Sakshi
మిథున్ రెడ్డికి బెయిల్

చిత్తూరు: రాజంపేట వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి తిరుపతి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడా కూడిన బెయిల్ ఇచ్చింది. నెల రోజుల పాటు నెల్లూరు జిల్లా విడిచి వెళ్లరాదని.. చిత్తూరు జిల్లాలో ఎక్కడా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించకూడదని షరతులు విధించింది. శ్రీకాళహస్తి వైఎస్సార్ సీపీ ఇన్ చార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

రేణిగుంటలో ఎయిరిండియా మేనేజర్‌పై దాడిచేశారన్న ఆరోపణల నేపథ్యంలో మిథున్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలను అరెస్ట్ చేయడం, నెల్లూరు జిల్లా కేంద్రకారాగారంలో వారు రిమాండ్ అనుభవిస్తుండడం తెలిసిందే.

మరిన్ని వార్తలు