కొడుకును చంపిన తల్లి

30 May, 2017 14:43 IST|Sakshi
కృష్ణా జిల్లా: పెనుగంచిప్రొలు మండలం  ముళ్లపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సుజాత అనే మహిళ రెండో వివాహానికి అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకును చంపేసింది. అన్నంలో విషం కలిపి కుమారుడు అశోక్ కుమార్(5)కు తినిపించి హత్య చేసింది. బాబు మరణించిన అనంతరం కాలువలో పడేసి ఏమి తెలియనట్లు నటించింది.
 
ఈ ఘటన ఈ నెల 25న జరగగా విచారణ చేపట్టిన పోలీసులు అసలు నిందితురాలు తల్లి సుజాతే అని తేల్చారు.  అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని వార్తలు