‘బాబు’ బెదిరేలా ఉద్యమిద్దాం

21 Aug, 2017 03:21 IST|Sakshi
‘బాబు’ బెదిరేలా ఉద్యమిద్దాం
కాపు ఉద్యమ నేత ముద్రగడ పిలుపు 
 
కిర్లంపూడి(జగ్గంపేట): రాష్ట్రంలో చంద్రబాబు సాగిస్తున్న నిరంకుశ పాలన దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. తీవ్ర అణచివేతకు పాల్పడుతున్న బాబు బెదిరేలా ఉద్యమించాలని కాపులకు పిలుపునిచ్చారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలన్న డిమాండ్‌తో ముద్రగడ తలపెట్టిన ‘చలో అమరావతి’ నిరవధిక పాదయాత్రను అడ్డుకుని ఆదివారానికి 26 రోజులైంది.

నిత్యం చేస్తున్నట్టే ముద్రగడ తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన ఇంటి గేటు వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి కాపులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వారినుద్దేశించి ముద్రగడ మాట్లాడారు.
మరిన్ని వార్తలు