ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని

27 Jan, 2016 22:18 IST|Sakshi
ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నన్నపనేని

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారిని ప్రభుత్వం నియమించింది. ఐదేళ్లపాటూ ఆమె మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు.

ఈ మేరకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా కమిషన్ రోజు వారీ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా 19 మంది సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది.
 

మరిన్ని వార్తలు