మద్యమే ఎన్నో అనర్థాలకు కారణం: నారాయణ స్వామి

8 Dec, 2019 20:38 IST|Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం 43వేల బెల్ట్‌షాపులు తొలగించిందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యాలయాన్ని ఆదివారం గుంటురూలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తమ ప్రభుత్వం మద్యాన్ని ఆదాయవనరుగా చూడటం లేదని పేర్కొన్నారు. సమాజంలో మద్యమే ఎన్నో అనర్థాలకు కారణమని నారాయణస్వామి తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్‌ లక్ష్మణ్‌ రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు