భీమవరం : నర్సాపురం-గుంటూరు ఫాస్ట్ ప్యాసింజర్కు మంగళవారం ఉదయం తృటిలో ప్రమాదం తప్పింది. ఉండి వద్ద రైలు పట్టా విరిగింది. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రమాదం తప్పింది. రైలును కొద్దిసేపు నిలిపివేశారు. రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు.