శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల

11 Feb, 2015 15:37 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండళ్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఫిబ్రవరి 19న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది.

ఎన్నికలు మార్చి 16న నిర్వహించనున్నారు. మార్చి 19న కౌంటింగ్ జరుపుతామని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏపీలో రెండు ఉపాధ్యాయ, తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్, వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే  ఉభయ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు