రేపు ప్రజాసంకల్పయాత్రకు విరామం

10 Oct, 2018 20:49 IST|Sakshi

సాక్షి, గజపతినగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. అయితే ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం గురువారం ఉదయం గజపతినగరం నియోజకవర్గం నుంచి జననేత పాదయాత్ర ప్రారంభం కావాలి. కానీ ఉత్తరాంధ్రలో భారీ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో రేపటి(గురువారం) పాదయాత్రకు విరామం ఇచ్చినట్లు వైఎస్సార్‌ సీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు