రోడ్డు ప్రమాదంలో..ఒకరు మృతి

2 May, 2015 07:24 IST|Sakshi

విశాఖపట్నం: సబ్బవరం మండల కేంద్రంలో శనివారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న లారీ, బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీకాంత్(22) అనే యువకుడు అక్కడిక్కడే మరణించాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు