బస్సు - ఆటో ఢీ: ఒకరి మృతి

9 Jun, 2016 08:28 IST|Sakshi

అనంతపురం : అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం ప్రైవేట్ బస్సు - ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని... బస్సు, ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు