ఒంగోలులో ఏసీబీకి పట్టుబడ్డ అధికారి

7 Dec, 2017 20:57 IST|Sakshi

సాక్షి, ఒంగోలు : ప్రకాశం జిల్లాలో ఓ అవినీతి అధికారి వ్యవహారం వెలుగు చూసింది. గురువారం ఒంగోలు నగర పాలక సంస్థ కార్యాలయంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డాడు. 

జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేసే రావిపాటి పూర్ణ చందర్‌రావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం అధికారులు అతన్ని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు