‘అక్రమ బస్సులు నడపడంలో కేశినేని దిట్ట’

17 Jun, 2017 13:49 IST|Sakshi
‘అక్రమ బస్సులు నడపడంలో కేశినేని దిట్ట’

విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేనిపై పలు ట్రావెల్స్‌ యజమానుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని నాని అక్రమ బస్సుల జాబితాను మీడియాకు విడుదల చేశారు. బస్సు నంబర్లతో సహా 27 బస్సుల జాబితా మీడియాకు విడుదల చేశారు.

ఇన్నాళ్లుగా కేశినేని వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా చేశారంటూ ఆరంజ్‌, మార్నింగ్‌ స్టార్‌ యజమానులు సునీల్‌ రెడ్డి, నివాస్‌లు శనివారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు.  కేశినేని ట్రావెల్స్‌ 27 ఓవవర్‌ హ్యాంగ్‌ బస్సులను నడిపిందని అన్నారు. అక్రమ బస్సులను నడపడంలో కేశినేని నానీ దిట్ట అని చెప్పారు. ఏపీలో రిజిస్ట్రయిన బస్సులు కూడా నిబంధనలకు విరుద్ధంగానే నడిచాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.