భూములకు పట్టాలివ్వలేదయ్యా!

15 Feb, 2018 06:52 IST|Sakshi

ఉదయగిరి: తాము 30 ఏళ్ల నుంచి భూములు సాగు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టాలివ్వలేదని జలదంకి మండలం తూర్పుదూబగుంటకు చెందిన గిరిజనులు ప్రజాసంకల్పయాత్రలో చిన్నఅన్నలూరు వద్ద బుధవారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులు మాట్లాడుతూ 1982లో ప్రభుత్వం 22 కుటుంబాలకు భూములు పంచిపెట్టి సాగుచేసుకోమని చెప్పిందన్నారు. ఇంతవరకు వాటికి పాస్‌పుస్తకాలు, పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. పలుమార్లు తహసీల్దారు, ఆర్డీఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని వాపోయారు. మన ప్రభుత్వం అధికారంలోకొస్తే మీ అందరికీ ఆ భూములకు సంబంధించి పట్టాలు ఇస్తామని జననేత వైఎస్‌ జగన్‌ వారికి హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు