పొలాలను ఎండగడుతున్నారు

29 Mar, 2018 07:03 IST|Sakshi

గుంటూరు: ‘అయ్యా.. పచ్చగా ఉండే పొలాలకు నీరివ్వకుండా ఎండగడుతున్నారు. నకిలీ పత్తి విత్తనాలకు మార్గాలు తెరచి రైతులను దెబ్బతీస్తున్నారు.  సాగు చేయాలంటే అప్పులు తప్పవనే భావన తీసుకొచ్చారు’ అంటూ సత్తెనపల్లి మండల రైతులు జననేత ఎదుట వాపోయారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్‌ జగన్‌ను కలసి సమస్యలు విన్నవించారు. సీఆర్‌డీఏ పరిధిలో తమ భూములు ఉన్నాయని, వాటికి మంచి ధర పలుకుతోందని.. ప్రభుత్వం ఎలాగైనా అప్పనంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని రైతులు కట్టా సాంబయ్య, వెంకటరెడ్డి, పిచ్చిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

>
మరిన్ని వార్తలు