పశ్చిమగోదావరి : అన్నా జగనన్న మాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అయితే ఆ భూమిలో బోరు లేకపోవడం వల్ల పంటలు పండించడానికి తీవ్రమైన సాగునీటి కొరత నెలకొంది. దీంతో ఆ భూములను ఖాళీగానే ఉంచుతున్నామని రామారావు గూడెంకు చెందిన సీలి వరలక్ష్మి అనే మహిళా రైతు జగన్మోహన్రెడ్డిని కలసి తన బాధను చెప్పుకుంది. అధికారులకు తెలియజేసి నా సమస్య పరిష్కారం దిశగా కృషిచేయండన్నా అని వేడుకుంది.