పుట్టుకతోనే నాకు రెండు కళ్లు కనిపించవు. దీంతో పింఛన్ ఇచ్చేవారు. అయితే జన్మభూమి కమిటీ సభ్యులు వచ్చే పింఛన్ రాకుండా అడ్డుకొని మా కడుపుకొట్టారయ్యా.. వంద శాతం వికలత్వం ఉందని వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్ చూపించినా అధికారులు ఇవ్వడం లేదు. మాలాంటోళ్ల కడుపుకొట్టి ఏం సాధిస్తారో ఏమోనంటూ నల్లమాడ మండలం రాగానపల్లికి చెందిన పుష్పావతి, అమె భర్త పెద్దనరసింహులు తమ బిడ్డతో కలసివచ్చి వైఎస్ జగన్మోహన్రెడ్డితో మొరపెట్టుకున్నారు. మీరైనా మాకు న్యాయం చేయండి’ అంటూ వేడుకున్నారు.