పశ్చిమగోదావరి : నా భర్తకు పక్షవాతం. నా బిడ్డ వికలాంగుడు, అతనికి ఇద్దరు అమ్మాయిలు. నా భర్తకు పింఛన్ కోసం రెండేళ్లుగా తిరుగుతున్నా మంజూరు చేయడంలేదు. నా బిడ్డకు నాడు వైఎస్సార్ హయాంలో పింఛన్ మంజూరైంది. నా భర్తకు పింఛన్ వచ్చేలా చూడన్నా అంటూ ఉండ్రాజవరం పాదయాత్రలో రాజేశ్వరి తన భర్తతో కలిసి జగన్మోహన్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.