దివ్యాంగులను ఆదుకోవాలి

21 Jun, 2018 07:38 IST|Sakshi

డి.చంద్రశేఖర్, దివ్యాంగుడు, వాడ్రేపుపల్లి
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకోవాలని వాడ్రేవుపల్లికి చెందిన దివ్యాంగుడు డి.చంద్రశేఖర్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రజా సంకల్ప యాత్రలో బుధవారం ఆయన జగన్‌కు వినతి పత్రం అందజేశారు. జగన్‌ సీఎం అయిన తరువాత డిజెబిలిటీ జీఓను 40 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని, దివ్యాంగులకు పింఛను రూ.5 వేలు నుంచి 7 వేలు ఇవ్వాలని, వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని, అంత్యోదయ కార్డు ఉన్న వారికి 50 కేజీల బియ్యం ఇవ్వాలని కోరానన్నారు. జగన్‌ సీఎం అయిత తరువాత వీటిని నెరవేరుస్తారని నమ్మకం ఉందని పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు