తూర్పుగోదావరి : ‘‘బీసీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్నా మంజూరు చేయడంలేదన్నా’’ అని తాటిపాకకు చెందిన ఫ్యాన్సీ షాపు నిర్వాహకురాలు కొలిపాకల నాగలక్ష్మి జగన్ వద్ద వాపోయింది. ఏడాది క్రితం రూ. 35 వేల కోసం రుణానికి దరఖాస్తు చేసుకోగా ఇప్పటికీ మంజూరు కాలేదని ఆమె తెలిపింది. అర్హులకు కార్పొరేషన్ రుణాలు సక్రమంగా అందేలా చూడాలని ఆమె జగన్ను కోరింది.