బాల కార్మికుడిపై దాష్టీకం!

30 Oct, 2014 21:13 IST|Sakshi

విజయవాడ: ఓ బాల కార్మికుడిపై వైన్ షాపు యజమానితోపాటు పోలీసులు కూడా దాష్టీకం ప్రదర్శించారు. కంకిపాడులోని వైన్ షాపులో ఓ బాల కార్మికుడు పని చేస్తున్నాడు. ఆ షాపులో 50 వేల రూపాయలు ఎవరో చోరీ చేశారు. షాపు నిర్వాహకుడు నాగేశ్వర రావు బాల కార్మికుడిని అనుమానించాడు. చిన్న పిల్లవాడని కూడా చూడకుండా దారుణంగా చితకబాదాడు.

ఆ తరువాత ఆ బాల కార్మికుడిని నాగేశ్వర రావు పెనమలూరు పోలీసులకు అప్పగించాడు.  చివరకు పోలీసులు కూడా దయా దాక్షిణ్యం లేకుండా ఆ బాలుడిని చితకబాదారు. బాలుడి తల్లిదండ్రులు లేబర్ కమిషన్ను ఆశ్రయించారు. వాళ్లు ఏం చేస్తారో చూడాలి.
**

మరిన్ని వార్తలు