పోలీసులను తరిమికొట్టిన జనం

4 Sep, 2014 00:39 IST|Sakshi
పోలీసులను తరిమికొట్టిన జనం
  • భయం గుప్పెట్లో చీడికాడ
  •  ఎస్‌ఐ లాఠీఛార్జీలో ఎంపీటీసీ భర్తకు గాయం
  •  వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
  •  పెద్ద ఎత్తున మోహరించిన బలగాలు
  •  పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ
  • చీడికాడ : వినాయక నిమజ్జనంలో మంగళవారం రా త్రి అపశ్రుతి చోటుచేసుకుంది. అశ్లీల నృత్యాలు చేసు తన్న వారిపై ఎస్‌ఐ లాఠీఛార్జి చేయడంతో జనం తిరగ బడ్డారు. పోలీసులను తరిమికొట్టారు. దీంతో బలగా లు మండల కేంద్రం చీడికాడతోపాటు బైలపూడిని చుట్టుముట్టాయి. రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు బుధవారం పరిస్థితిని సమీక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వినాయక నిమజ్జనంలో భాగంగా బైలపూడిలో అశ్లీల నృ త్యాలు జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు ఎస్.ఐ విశ్వనాథం సిబ్బందితో వెళుతుండగా చీడికాడ మొయిన్‌రోడ్డులో వివిధ వీధులకు చెందిన వినాయక విగ్రహాలకు నిమజ్జనానికి ఊరేగిస్తున్నా రు.

    ఇందులో భాగంగా ఇద్దరు హిజ్రాలతో డ్యాన్స్ చేయిస్తుండడంతో ఎస్.ఐ విశ్వనాథం వారిపై లాఠీ ఛార్జి చేశారు. ట్రాక్టర్ తాళాలు తీసుకున్నారు. అనంతరం బైలపూడి వెళ్లిపోయారు. అక్కడ గుమ్మాల వారి కుటుంబీకులకు చెందిన వినాయక నిమజ్జనంలో ఎంపీటీసీ భర్త గుమ్మాల తారకేసు,అప్పారావులు చీరలు కట్టుకుని ఆడవారి వేషంలో డాన్స్ చేస్తున్నారు. వారిపై కూడా ఎస్‌ఐ లాఠీఛార్జి చేశారు. దీంతో తారకేసు కుడిచేయిపై గట్టిగా కొట్టారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

    దీంతో గ్రామస్తులు పోలీసులపై దాడి చేశారు. ఈ సంఘటనలో హోంగార్డు కనకరాజుకు కుడి కన్ను కనత, చెంపపై వాపుగాయం అయింది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా శిరిజాం జంక్షన్‌లో మహిళలు,యువకులు పోలీసు జీపును అడ్డుకున్నారు. పలువురు యువకులు రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. మరికొందరు జీపుపైకి ఎక్కి అద్దాలు,లైట్లను ధ్వంసం చేశారు. జీపు టైర్లలో గాలి తీసేశారు. పోలీసులపై పిడుగుద్దులతో దాడి చేశారు. ఈ పరిణామంతో జీపును వదిలి పోలీసులు పరుగులు తీశారు.

    ఈ సంఘటనలో ఎస్.ఐ విశ్వనాథం సెల్‌ఫోన్ పగిలిపోయింది. ఇలా ఎస్‌ఐతోపాటు సిబ్బందిపై దాడి జరిగిన వైనంపై చీడికాడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఎస్పీ విచారణ చేపట్టారు. ధ్వంసమైన జీపు, పగిలిపోయిన ఎస్‌ఐ సెల్‌ఫోన్, గాయపడిన హోంగార్డు కనకరాజును పరిశీలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితులను విచారించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాలప్పుడు గ్రామాల్లో అపశ్రుతులతో ప్రజాజీవనానికి అటంకం కలిగించే శక్తులను అడ్డుకునేందుకు అహర్నిశలు కాపాలాగా ఉండే పోలీసులపై దాడి శోచనీయమన్నారు.

    అటువంటి వారిపై తీవ్రంగా వ్యవహరిస్తారన్నారు. ఈమేరకు గ్రామమంతటా పోలీసులు మోహరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు నాలుగు జీపుల్లో బలగాలు గ్రామంలో చక్కర్లు కొట్టాయి. దీంతో అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. ఎస్‌ఐ విశ్వనాథం బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల్లోనే  మండలంలోని నీలంపేట,చినకోనాంలతో పాటు ఇప్పుడు చీడికాడ,బైలపూడి గ్రామాల వారు పోలీసులపై దాడులు,కేసులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
     

మరిన్ని వార్తలు