కేశినేని నాని కార్యాలయం వద్ద ఆందోళన

20 Oct, 2014 10:33 IST|Sakshi

విజయవాడ :  విజయవాడ పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని కార్యాలయం వద్ద సోమవారం స్థానికులు ఆందోళనకు దిగారు.  లీజుకు ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించుకున్నారని ఎంపీ కేశీనేనిపై ఆరోపణలు ఉన్నాయి.  బొమ్మదేవర వెంకట సుబ్బారావుకు చెందిన 500 గజాల స్థలాన్ని ఏడాదిగా కేశనేని నాని పార్కింగ్కు ఉపయోగించుకుంటున్నారు.

 

అయితే రెండు నెలలుగా ఆ స్థలాన్ని ఖాళీ చేసి ..తమకు అప్పగించాలని కోరినా పట్టించుకోవటం లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. దాంతో బాధితుడు స్థానికులతో కలిసి ఈరోజు ఉదయం నాని కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశాడు. తక్షణమే తన స్థలాన్ని అప్పగించాలని డిమాండ్ చేశాడు.

మరిన్ని వార్తలు