విశాఖపట్టణం : దక్షిణ ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ, ఛత్తీస్గఢ్లపై బలమైన ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైందన్నారు.
దీని ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలతో పాటు రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.