ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారీ

15 Mar, 2015 14:22 IST|Sakshi
ఆస్పత్రి నుంచి రిమాండ్ ఖైదీ పరారీ

విశాఖ:నగరంలోని కేజీహెచ్ నుంచి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన తాజాగా ఆదివారం వెలుగుచూసింది. రిమాండ్ ఖైదీగా ఉన్న సన్యాసిరావు గత కొన్ని రోజుల క్రితం పచ్చకామెర్ల చికిత్స కోసం కేజీహెచ్ లో చేరాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సన్యాసిరావును ఈనెల 7వ తేదీన ఆస్పత్రిలో చేర్చారు. అయితే ఇదే అదునుగా తీసుకున్న ఆ  ఖైదీ బాత్ రూం గ్రిల్స్ తొలగించి పరారైనట్లు ఎస్కార్ట్ సిబ్బంది గుర్తించారు. దీనిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు