దంపతులపై దుండగుల దాడి: భర్త మృతి

14 Sep, 2015 07:27 IST|Sakshi

పొన్నలూరు: ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం పాగసింగరబట్ల పాలెంలో సోమవారం తెల్లవారుజామున దారుణం జరిగింది. బైకుపై వెళ్తున్న దంపతులపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా.. భార్యకు గాయాలయ్యాయి. మృతుడు ఆర్టీసీ డ్రైవర్ పుల్లారెడ్డిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు