Sakshi News home page

భర్తపై కోపం.. పోలీసులకు బాంబు బెదిరింపు

Published Wed, Dec 6 2023 12:10 AM

- - Sakshi

బనశంకరి: భర్తపై ఉన్న కోపంతో తీసుకున్న ఓ అనాలోచిత నిర్ణయం ఓ మహిళను చిక్కుల్లో పడేలా చేసింది. వివరాలు.. ఆనేకల్‌ పట్టణం మారుతి లేఔట్‌కు చెందిన విద్యారాణికి ఆన్‌లైన్‌లో రామ్‌కుమార్‌ పరిచయం కావడంతో ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. విద్యారాణి భర్త కిరణ్‌ విషయం గుర్తించి ఫోన్‌ పగలగొట్టారు. ఇది రామ్‌కుమార్‌కు తెలిపింది. ఈ సమయంలో ఇద్దరూ బాంబు బెదిరింపునకు కుట్రపన్నారు.

ఆ మేరకు విద్యారాణి ఆదివారం విద్యారాణి తన భర్త కిరణ్‌ వాట్సాప్‌ నుంచి ఆర్‌డీఎక్స్‌ బాంబు పెట్టారని పోలీసులకు మెసేజ్‌ పంపించింది. పోలీసులు కిరణ్‌ ఇంటికి వెళ్లి విచారించగా, విద్యారాణి బండారం బయటపడింది. స్నేహితుల సలహా మేరకు తన భర్తపై పగ తీర్చుకోవడానికి మెసేజ్‌ పంపినట్లు మహిళ నోరు విప్పింది. విద్యారాణి, ఇద్దరు స్నేహితులపై కేసు నమోదు చేశారు..

Advertisement

What’s your opinion

Advertisement