కొనసాగుతున్న ఆర్టీఏ దాడులు, 52 బస్సులు స్వాధీనం

23 Nov, 2013 02:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ప్రైవేట్ బస్సులపై రవాణాశాఖ చేస్తున్న దాడులు శుక్రవారం కూడా కొనసాగాయి. బెంగళూరు జాతీయ రహదారిపై నిర్వహించిన దాడుల్లో నిబంధనలు పాటించని 52 బస్సులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్ డీటీసీ టీ రఘునాథ్ పాత్రికేయులకు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులు దాడుల్లో పాల్గొన్నారని, పట్టుబడిన బస్సులు స్టేజి క్యారేజీలుగా తిరుగుతున్నవేనని ఆయన వివరించారు.
 

>
మరిన్ని వార్తలు