ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ దాడులు

29 May, 2015 15:47 IST|Sakshi

హైదరాబాద్ :  ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్ అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, కూకట్‌పల్లి, లక్డీకాపూల్‌లో శుక్రవారం అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకు నిబంధనలు పాటించని 14 ట్రావెల్స్‌ సంస్థలపై కేసులు నమోదు చేశారు. వీటిలో కేశినేని, ఆరెంజ్, ఎస్వీఆర్ ట్రావెల్స్ తదితర సంస్థలు ఉన్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు