ఈనాటి ముఖ్యాంశాలు

24 Jun, 2019 20:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర విదేశాంగ శాఖమంత్రి ఎస్‌ జైశంకర్‌ అధికారికంగా బీజేపీలో చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో సోమవారం పార్టీ కండువా కప్పుకున్నారు. ఎన్సీపీ మద్దతుతో గెలుపొందిన ప్రముఖ నటి, అమరావతి (మహారాష్ట్ర) ఎంపీ నవనీత్‌కౌర్‌ రానా, ఆమె భర్త యువ స్వాభిమాన్‌ పార్టీ అధ్యక్షుడు రవిరాణా బీజేపీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం డ్రికింగ్‌ వాటర్‌ కార్పొరేషన్‌తో నిధులు తెచ్చి వాటిని పసుపు కుంకుమ పథకానికి మళ్లించారని పంచాయతీ రాజ్‌, గ్రామిణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మోకాలి గాయంతో బాధపడుతున్న వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌ రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ వరల్డ్‌కప్‌ నుంచి వైదొలిగాడు.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

మరిన్ని వార్తలు