ప్రత్యేక ప్యాకేజీ కోసం విద్యార్థుల ధర్నా

13 Aug, 2015 11:11 IST|Sakshi

ఎచ్చెర్ల: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్సిటీకీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ విద్యార్థులు గురువారం ధర్నాకు దిగారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో మండలంలోని అంబేద్కర్ వర్సిటీకీ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం  ఆధ్వర్యంలో విద్యార్థులు వర్సిటీ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నిరసనకు సీపీఎం, సీఐటీయూసీలు మద్దతు తెలిపాయి. వర్సిటీకి ప్యాకేజీ ప్రకటించే వరకు తమ పోరాటం సాగుతూనే ఉంటుందని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు