ట్రిపుల్‌ ఐటీ కౌన్సెలింగ్‌ ఎప్పుడు?

20 Aug, 2018 07:09 IST|Sakshi

విశాఖపట్నం :నా పేరు తమరాన వసుధ. మాది వజ్రగడ. ఏపీ మోడల్‌ స్కూల్‌లో పదో తరగతి చదివాను. 9.8 గ్రేడ్‌ పాయింట్లు సాధించాను. నాకు ట్రిపుల్‌ ఐటీలో సీటు వచ్చేందుకు అవకాశం ఉంది. పదో తరగతి ఫలితాలు విడుదలై మూడు నెలలు కావస్తున్నా.. రెండో కౌన్సెలింగ్‌ చేయడం లేదు. మొదటి కౌన్సెలింగ్‌లో ప్రైవేట్‌ సంస్థలకు చెందిన విద్యార్థులకు సీటు రాలేదని కోర్టుకు వెళ్లారంటా.. వారితో మాకేంటి సంబంధం. ఇలాంటి కారణాలు చెప్పి మాలాంటి వారి ఉన్నత చదువులకు టీడీపీ ప్రభుత్వం మోకాలడ్డుతుంది. ఈ విషయాన్ని జగన్‌ అన్న దృష్టికి తీసుకెళ్లాను.

మరిన్ని వార్తలు