ఎస్కేయూలో విద్యార్థి సంఘాలు ఆందోళన

1 Jul, 2013 14:33 IST|Sakshi

డిగ్రీ ఒరిజనల్ సర్టిఫికెట్లు లేవన్న కారణంగా మెరిట్ విద్యార్దులకు సీట్లు నిరాకరించడంతో శ్రీ కృష్ణదేవరాయ యూనివర్శిటీలో పీజీ కౌన్సిలింగ్ సోమవారం రసాభసగా మారింది. ఒరిజనల్ సర్టిఫికెట్లు లేకుంటే యూనివర్శిటీ పరిధిలోని పీజీ కాళశాలల్లో కోర్సుల్లో ప్రవేశానికి అనుమతించేది లేదని యూనివర్శిటీ ఉన్నతాధికారులు తెలపడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వారికి విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపాయి. దాంతో యూనివర్శిటీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్శిటీ పరిధిలోని కళాశాలల్లో పీజీ ప్రవేశానికి సోమవారం కౌన్సిలింగ్ ప్రారంభమైంది.

మరిన్ని వార్తలు