తూర్పుగోదావరి : నా కుమారుడు మెదడు, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడన్నా.. ఆదుకోండన్నా అంటూ పందలపాకకు చెందిన కొల్లి వెంకటలక్ష్మి జగన్ను కోరింది. మూడేళ్ల వయసు గల తన కుమారుడు సందీప్కు ఆరు నెలల వయస్సులో ఫిట్స్ వచ్చాయని ఆస్పత్రికి తీసుకువెళితే బ్రెయిన్లో మచ్చలు ఉన్నాయని డాక్టర్లు చెప్పారని, దీనివల్ల కిడ్నీల సమస్యతో పాటు కంటి చూపు కూడా మందగించిందని వాపోయింది. ఇప్పటి వరకు వైద్యానికి రూ.3 లక్షల వరకు ఖర్చు చేశామని తన కుమారుడిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేసింది.