వైఎస్సార్‌ సీపీకి అనుకూలమని..

16 Nov, 2018 06:34 IST|Sakshi

విజయనగరం  :పార్వతీపురం వసుంధర నగర్‌ కాలనీ ప్రజలు వైఎస్సార్‌ సీపీకి అనుకూలంగా ఉన్నారన్న నెపంతో కనీసం సీసీ రోడ్డయినా నిర్మించడం లేదు. దీంతో వర్షాకాలంలో ఈ కాలనీలోని 150 కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ఆటోలు వంటి వాహనాలు కూడా కాలనీలోకి రాకపోవడంతో జంక్షన్‌ నుంచే కొనుగోలు చేసిన సరుకులను ఇళ్ల వద్దకు తీసుకెళ్లాల్సి వస్తోంది. మురుగు కాలువల్లేక వాడుక నీరు నిల్వ ఉండిపోతూ దుర్గంధం, దోమలు విజృంభిస్తున్నాయి.. అంటూ కె.పద్మావతి మొర పెట్టుకుంది.

ఉద్యోగాలేవీ
నా ముగ్గురు పిల్లలు సుమతి, అశోక్‌ కుమార్, నవీన కుమారి ఎంఏ, ఏంఈడీ, బీఈడీలు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నా నేటికీ రాలేదు..అంటూ పార్వతీపురం మండలం వసుంధర నగర్‌కు చెందిన గంటా మేరీ పద్మా వాపోయింది. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల్లో ప్రచారాలు హోరెత్తించారు. ఉన్నత విద్య చదివినా ఉద్యోగం రాలేదని నా పిల్లలు బెంగ పెట్టుకున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక నా బిడ్డల్లాంటి నిరుద్యోగులందరికీ ఉద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

మరిన్ని వార్తలు