హైదరాబాద్: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
వచ్చే నెల 3 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. టీడీపీలో క్రియాశీల కార్యకర్తలకు 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించనున్నారు.