పోలవరం సీటుపై తెలుగు తమ్ముళ్లు రచ్చరచ్చ

13 Mar, 2019 13:12 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పోలవరం అసెంబ్లీ సీటు పంచాయతీపై సీఎం చంద్రబాబు నాయుడు నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు రచ్చరచ్చ చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస రావుకు పోలవరం అసెంబ్లీ టికెట్‌ ఇవ్వద్దని ఆయన వ్యతిరేక వర్గం నినాదాలు చేయగా, ఆయకే సీటు కేటాయించాలని అనుకూల వర్గం డిమాండ్‌ చేస్తోంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి కొట్లాటకు దారీతీసింది. పోలీసులు రంగ ప్రవేశం చేసినా వారిని అదుపుచేయలేక పోయారు. పార్టీలోని రెండు వర్గాల నేతల అరుపులు కేకలతో సీఎం నివాస ప్రాంతం దగ్గరిల్లింది.

సీటు కోసం బరితెగించిన తెలుగు తమ్ముళ్లు ఒకరిపైకి మరోకరు దూసుకొచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలు ఇద్దరూ అక్కడి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలవరం సీటును ముడియం శ్రీనివాస రావుకు ఇస్తే ఓడించి తీరుతామని ఆయన వ్యతిరేక వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవర్గం మాత్రం ముడియంకు సీటు కేటాయించకపోతే పార్టీకి సహకరించేదిలేదని అల్టిమేటం జారీచేశారు. ఈ నేపథ్యంలో పోలవరం అభ్యర్థి ఎంపిక గందరగోళంగా మారింది. 

మరిన్ని వార్తలు