మోనాలిసా చిత్రంలా తెలంగాణ: మంత్రి పితాని

11 Jul, 2013 14:46 IST|Sakshi
మోనాలిసా చిత్రంలా తెలంగాణ: మంత్రి పితాని

హైదరాబాద్: తెలంగాణ అంశం మోనాలిసా చిత్రంలాగా ఉందని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. ఆ చిత్రం ఎటువైపు చూస్తే అటువైపు వారికి అనుకూలంగా కనిపిస్తుందని చెప్పారు. సచివాలయంలో ఫీజు రీయింబర్స్మెంట్పై  మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు.

 ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలన్నీ చెల్లించినట్లు తెలిపారు. ఏ ఒక్క విద్యార్థికి కూడా ప్రభుత్వం బకాయి లేదని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ దీక్ష చేపట్టడం రాజకీయం, హాస్యాస్పదం అని ఆయన అన్నారు.
కాలేజీ  యాజమాన్యాలు చేస్తున్న బ్లాక్మెయిల్కు  వైఎస్ఆర్సిపి వంతపాడుతోందన్నారు.  ఫీజు రీయింబర్స్మెంట్పై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల కోడ్ దృష్యా ఆ నిర్ణయాలు ఇప్పుడు ప్రకటించలేమని చెప్పారు.

మరిన్ని వార్తలు