సాక్షి, హైదరాబాద్/విజయనగరం: విజయనగరం జిల్లాలో కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు శని, ఆదివారాలు విరామం ప్రకటించినట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.
విశాఖ విమానాశ్రయంలో గురువారం జరిగిన హత్యాయత్నం నేపథ్యంలో జగన్ ఆరోగ్య పరిస్థితిపై శనివారం సాయంత్రం వైద్యులు పూర్తిస్థాయి నివేదికను అందించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. నివేదిక అందిన తర్వాత వైద్యుల సూచనల మేరకు, పార్టీ నేతలు సమావేశమై పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయంపై స్పష్టమైన సమాచారం అందిస్తామని తెలిపారు.