రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి

29 Feb, 2016 16:30 IST|Sakshi

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా పొద్దుటూరు సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పుల్లయ్యగారి వీధికి చెందిన తండ్రీ కొడుకులు కంపరాజు నారాయణ స్వామి(65), రామకృష్ణ(45) బైక్ పై దువ్వూరు నుంచి పొద్దుటూరు వస్తుండగా.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది.

దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు