తిరుమల : తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉంది. సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 56,723 మంది భక్తులు శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 9 గంటలు, కాలిబాట భక్తులకు 3 గంటల తర్వాత శ్రీవారి దర్శనం లభిస్తోంది. హుండీ కానుకలు రూ.3.05 కోట్లు లభించాయి.