శ్రీవారికి ఒక్కరోజులో రికార్డు స్థాయి ఆదాయం

26 May, 2014 00:24 IST|Sakshi

ద్వారకాతిరుమల, న్యూస్‌లైన్ : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి శనివారం ఒక్కరోజులో రికార్డుస్థాయిలో ఆదాయం లభించిందని ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు చెప్పారు. ప్రసాదాలు, దర్శనం టికెట్లు, సత్రాల గదుల అద్దెల ద్వారా ఒక్కరోజులో మొత్తం రూ.16,20,226 లభించిందని తెలిపారు. ఇప్పటివరకు ఒక్కరోజులో గతంలో ఇంత ఆదాయం లభించలేదన్నారు. వేసవి సెలవులు, వివాహాలు అధికంగా జరగడంతో క్షేత్రానికి వచ్చిన భక్తుల ద్వారా ఇంత ఆదాయం సమకూరిందని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు