తిరుమలకు పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనం కోసం 12 గంటలు

3 Nov, 2023 08:56 IST|Sakshi

సాక్షి, తిరుపతి: తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం 23 కంపార్టుమెంట్‌లలో భక్తులు వేచిచూస్తున్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 

ఇదిలా ఉంటే.. గురువారం శ్రీవారిని 59,335 మంది భక్తులు దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ‌23,271 కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.29 కోట్లుగా తేలింది. 

మరిన్ని వార్తలు