ఈనాటి ముఖ్యాంశాలు

24 Sep, 2019 20:51 IST|Sakshi

ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హైదరాబాద్‌ పర్యటనను ముగించుకొని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తాడేపల్లికి చేరుకున్నారు. పోలవరం హెడ్‌వర్క్స్, జలవిద్యుత్‌ కేంద్రం పనుల రివర్స్‌ టెండరింగ్‌తో సుమారు రూ. 780 కోట్లు ఆదా చేసి చరిత్ర సృష్టించామని  రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. అమరావతి నూతన రైల్వేలైను, దక్షిణకోస్తా జోన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఎంపీలమంతా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు విజ్ఞప్తి చేశామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎంపీ మిధున్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్టోబర్‌ 10 నుంచి 16 వరకు ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు. హుజూర్‌నగర్‌ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి రెడ్డి పేరును అధిష్టానం ఖరారు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

మరిన్ని వార్తలు