విజయవాడ: కనకదుర్గమ్మ వారధిపై శనివారం ఉదయం భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి కారు మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదంలో బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జాం అయింది పోలీసులు ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.