భూగర్భ గనుల శాఖ ఏడీ సెస్పెన్షన్

2 Nov, 2013 00:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనుల శాఖకు చెందిన సహాయ సంచాలకులు(ఏడీ) ఎం. సుబ్రమణ్యం సస్పెండ్ అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే అభియోగంపై సుబ్రమణ్యంను ఏసీబీ అధికారులు అక్టోబర్ 7న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేస్తూ జ్యుడీషియల్ కస్టడీకి వెళ్లినప్పటి నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు భూగర్భ గనుల శాఖ కార్యదర్శి సవ్యసాచి ఘోష్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌లో ఉన్నప్పటికీ అనుమతి లేనిదే విశాఖపట్నం విడిచి వెళ్లరాదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు